జీఎం కార్యాలయ ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా ఉండాలి

  • ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని
  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
  • జీఎం కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఉద్యోగులు సింగరేణి వ్యాప్తంగా ఉన్న సిబ్బంది అందరికీ ఆదర్శంగా నిలవాలని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం ఆయన జీఎం కార్యాలయ ప్రాంగణంలోని అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇంజనీరింగ్, ఐఈడీ, క్వాలిటీ, ఐటీ, ఫారెస్ట్, ఫైనాన్స్, ఎస్టేట్స్, సర్వే సెక్షన్లను సందర్శించారు. మొదటి అంతస్తులోని పర్సనల్, సివిల్, పర్చేస్ విభాగాల్లో ఇన్స్పెక్షన్ చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన విభాగాధిపతులతో కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏరియా పరిధిలోని గనులు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీఎం కార్యాలయ ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలని మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాల్లో పర్సనల్ విభాగం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. సివిల్, ఎస్టేట్స్, ఫైనాన్స్ వంటి అన్ని విభాగాలు తమ విధులను సకాలంలో పూర్తి చేయాలని జీఎం సూచించారు. జీరో పెండెన్సీ లక్ష్య సాధన దిశగా అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణారావు పాల్గొన్నారు. డీజీఎంలు రాజన్న, ఎస్. అనిల్ కుమార్, లా ఆఫీసర్ మల్లేష్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ హాజరయ్యారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

జీఎం కార్యాలయ ఉద్యోగులు అందరికీ ఆదర్శంగా ఉండాలి

  • ఉద్యోగులు జవాబుదారీతనంతో పనిచేయాలని
  • శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
  • జీఎం కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ

నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ జీఎం కార్యాలయ ఉద్యోగులు సింగరేణి వ్యాప్తంగా ఉన్న సిబ్బంది అందరికీ ఆదర్శంగా నిలవాలని ఏరియా జీఎం మునిగంటి శ్రీనివాస్ ఆకాంక్షించారు. శుక్రవారం ఉదయం ఆయన జీఎం కార్యాలయ ప్రాంగణంలోని అన్ని విభాగాల్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. కార్యాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఇంజనీరింగ్, ఐఈడీ, క్వాలిటీ, ఐటీ, ఫారెస్ట్, ఫైనాన్స్, ఎస్టేట్స్, సర్వే సెక్షన్లను సందర్శించారు. మొదటి అంతస్తులోని పర్సనల్, సివిల్, పర్చేస్ విభాగాల్లో ఇన్స్పెక్షన్ చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన విభాగాధిపతులతో కార్యకలాపాలపై ఆరా తీశారు. ఏరియా పరిధిలోని గనులు, కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి జీఎం కార్యాలయ ఉద్యోగులు జవాబుదారీగా ఉండాలని మునిగంటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ముఖ్యంగా ఉద్యోగుల సంక్షేమ వ్యవహారాల్లో పర్సనల్ విభాగం అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాల విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని కోరారు. సివిల్, ఎస్టేట్స్, ఫైనాన్స్ వంటి అన్ని విభాగాలు తమ విధులను సకాలంలో పూర్తి చేయాలని జీఎం సూచించారు. జీరో పెండెన్సీ లక్ష్య సాధన దిశగా అధికారులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎస్ ఓ టూ జీఎం ఎన్. సత్యనారాయణ, ఏరియా ఇంజనీర్ రమణారావు పాల్గొన్నారు. డీజీఎంలు రాజన్న, ఎస్. అనిల్ కుమార్, లా ఆఫీసర్ మల్లేష్, ఐటీ ప్రోగ్రామర్ శ్రీనివాస్ హాజరయ్యారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment