విద్యార్థుల నమోదులో రాష్ట్రంలోనే మంచిర్యాల ప్రథమం

పీఆర్‌టీయూ-టీఎస్ అభినందనలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించి, తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవడం విద్యాశాఖ సమిష్టి కృషికి నిదర్శనమని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ – తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా శాఖ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడింది. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు, పాఠశాల నిర్వహణ కమిటీలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలకు పీఆర్‌టీయూ-టీఎస్ జిల్లా పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, బచ్చ మోహన్ రావు అభినందనలు తెలిపారు. వేసవి సెలవుల నుంచే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలపై అవగాహన కల్పించి నమోదును విజయవంతం చేసిన ఉపాధ్యాయుల అంకితభావాన్ని నేతలు ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో విద్యా ప్రమాణాలను మరింత పెంచి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

విద్యార్థుల నమోదులో రాష్ట్రంలోనే మంచిర్యాల ప్రథమం

పీఆర్‌టీయూ-టీఎస్ అభినందనలు

నస్పూర్, ఆర్.కె న్యూస్: 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రభుత్వం నిర్దేశించిన విద్యార్థుల నమోదు లక్ష్యాన్ని విజయవంతంగా అధిగమించి, తెలంగాణ రాష్ట్రంలోనే మంచిర్యాల జిల్లా మొదటి స్థానంలో నిలవడం విద్యాశాఖ సమిష్టి కృషికి నిదర్శనమని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ – తెలంగాణ స్టేట్ మంచిర్యాల జిల్లా శాఖ బుధవారం ఒక ప్రకటనలో కొనియాడింది. ఈ విజయానికి కృషి చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి, మండల విద్యాధికారులు, సెక్టోరల్ ఆఫీసర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యా వాలంటీర్లు, పాఠశాల నిర్వహణ కమిటీలు, తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, దాతలకు పీఆర్‌టీయూ-టీఎస్ జిల్లా పక్షాన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొట్టే శంకర్, బచ్చ మోహన్ రావు అభినందనలు తెలిపారు. వేసవి సెలవుల నుంచే ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, డిజిటల్ బోధన, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలపై అవగాహన కల్పించి నమోదును విజయవంతం చేసిన ఉపాధ్యాయుల అంకితభావాన్ని నేతలు ప్రశంసించారు. భవిష్యత్తులోనూ ఇదే ఉత్సాహంతో విద్యా ప్రమాణాలను మరింత పెంచి, రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

AD 01

Follow Me

Gemini_Generated_Image_gxjet7gxjet7gxje
previous arrow
next arrow
Gemini_Generated_Image_01

Leave a Comment