విరాళంగా సేకరించిన 50 వేల రూపాయలు అందజేత
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఎస్సార్పీ 3&3ఏ గని కార్మికుడు బైండ్ల మహేష్ కుటుంబానికి తోటి ఉద్యోగులు అండగా నిలిచారు. ఇటీవల గుండెపోటుతో మరణించిన మహేష్ భార్యకు సేకరించిన 50 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని గురువారం అందజేశారు. ఏఐటీయూసీ పిట్ సెక్రటరీ మురళి చౌదరి, డిప్యూటీ మేనేజర్ అనిల్ సింగ్, మున్షి గాజుల ప్రభాకర్ బాధిత కుటుంబానికి ఈ నగదును అందజేశారు. గనిలో ట్రామర్గా విధులు నిర్వర్తిస్తున్న మహేష్ అకస్మాత్తుగా మరణించడంతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. తోటి కార్మికుడి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఉద్యోగులందరూ స్వచ్ఛందంగా విరాళాలు సేకరించారు. కష్టకాలంలో ఉన్న కుటుంబానికి ఈ సాయం కొంత ఊరటనిస్తుందని ప్రతినిధులు పేర్కొన్నారు. కార్మికుల మధ్య ఉన్న ఐక్యత, మానవత్వాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో గని ఉద్యోగులు ఆడెపు సురేష్, గాజుల కార్తీక్, బేతి మల్లేష్, చక్రి, శ్రీనివాస్, రవి వర్మ, తాటి శ్రీనివాస్, రాజ్ కుమార్, నరేష్ కుమార్, గండు శ్రీకాంత్, రాజయ్య ఇతర కార్మికులు పాల్గొన్నారు.





ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య ఈ కార్యక్రమానికి హాజరై డివిజన్ వ్యాప్తంగా చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో చర్చించి తగిన సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, సిబ్బందితో కలిసి డివిజన్ అంతటా పర్యటించిన మేయర్ బృందం స్థానిక ప్రజలతో నేరుగా మాట్లాడారు. పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. డివిజన్ పరిధిలోని సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని పరిసరాల పరిశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. 99 రోజుల ప్రణాళికాబద్ధమైన ఈ పారిశుధ్య పనుల ద్వారా నగరాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని మేయర్ వివరించారు. ప్రజల సహకారంతోనే పట్టణ సుందరీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ అమృత రాజ్ కుమార్, 27వ డివిజన్ కార్పొరేటర్ కొండ్ర రాజేశ్వరి లింగయ్య, వార్డు ఆఫీసర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
జీఎం కార్యాలయం వరకు పోలీసులు, కార్మికులు, స్థానిక ప్రజలతో కలిసి ఈ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జైపూర్ ఏసీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత అని, నియమాలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది విధిగా హెల్మెట్ ధరించాలని, నో హెల్మెట్ – నో ఎంట్రీ నిబంధనను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులతో పాటు వెనుక కూర్చున్న వారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ప్రమాదకరమని, నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వ్యాస రచన, చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ వివరించారు. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, ప్రజల భద్రతను పరిరక్షించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే ఈ ర్యాలీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాంపూర్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్, జైపూర్ సిఐ నవీన్ కుమార్, ఎస్సైలు రాజశేఖర్, మేకల సంతోష్, లక్ష్మీ ప్రసన్న, పోలీస్ సిబ్బంది, సింగరేణి కార్మికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.