శ్రీరాంపూర్ బిఎంఎస్ కార్యాలయంలో ఘనంగా జయంతి వేడుకలు
నస్పూర్, ఆర్.కె న్యూస్: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ (బిఎంఎస్) కార్యాలయం వద్ద మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు బాబాసాహేబ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికే పరిమితం కాదని, న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా ఆయన భారతీయులందరి గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడని కొనియాడారు. అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. దేశంలోని అన్ని మతాలు, కులాలు, వెనుకబడిన వర్గాలకు సమన్యాయం జరిగేలా అంబేద్కర్ అత్యున్నతమైన రాజ్యాంగాన్ని రూపొందించారని, తద్వారా భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పబ్బతినేని కమలాకర్ రావు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జాయింట్ సెక్రటరీలు భూంపల్లి రమేష్, బోయిన మల్లయ్య, దుంపల శ్రీధర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ జెల్ల తిరుపతి, డివిజన్ నాయకులు చల్లా ప్రశాంత్, బొమ్మకంటి కిషన్, పిట్ సెక్రటరీలు కొమ్మ బాపు, కాంపల్లి తిరుపతి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీలు కుమ్మరి చంద్రశేఖర్, కుంట రాజు, చల్లా శ్రీనివాస్, ప్రైవేట్ సెక్టార్ ప్రతినిధులు నీరటి సురేష్ కుమార్, కానవేన స్వామి, మిట్టపల్లి మొగిలి తదితరులు పాల్గొన్నారు.




భాగంగా శనివారం 02వ డివిజన్లో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టారు. ఈ పనులను డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్తో కలిసి మేయర్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. పారిశుద్ధ్య పనుల పురోగతిపై అధికారులకు తగిన సూచనలు చేశారు. పట్టణ అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు దర్ని మధుకర్ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రతి డివిజన్లో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కూడా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని మున్సిపల్ యంత్రాంగానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 02వ డివిజన్ కార్పొరేటర్ పుట్ట యశోద, మంచిర్యాల మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సల్ల మహేష్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు భూపతి శ్రీనివాస్, నస్పూర్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అజయ్ గౌడ్, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
