నస్పూర్, ఆర్.కె న్యూస్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు ఆధ్వర్యంలో జూలై 1న క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్స్లో నిర్వహించబోయే “సింగరేణి పరిరక్షణ సదస్సు” గోడప్రతులను ఆర్.కె-7 గనిపై మంగళవారం విడుదల చేశారు. టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సురేందర్ రెడ్డి, ఏరియా వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ పాల్గొని మాట్లాడారు. సింగరేణిలో జరుగుతున్న అవినీతి, కుంభకోణాలపై కార్మికులను చైతన్యపరచడానికే ఈ సదస్సు అని, కార్మికులంతా పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం ఉద్యోగ విరమణ పొందుతున్న టెండల్ సూపర్వైజర్ మల్లేష్ను యూనియన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ ఏరియా సెక్రటరీలు తొంగల రమేష్, మహిపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ పాదం శ్రీనివాస్, షిఫ్ట్ సెక్రటరీ గంధం గురుమూర్తి, గని నాయకులు మల్లేష్, కృష్ణమూర్తి, రాజేందర్, కొప్పుల రవీందర్, దార వంశీకృష్ణ, రంజిత్ పటేల్, ముత్యం రాకేష్, కత్తి రాకేష్, రవి, అజిత్ రావు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
KYATHAM RAJESH
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్.కె. న్యూ టెక్ గనిలో సుదీర్ఘ కాలం పాటు సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన డిప్యూటీ సూపరింటెండింగ్ ఇంజనీర్ (పిట్ ఇంజనీర్) దాసరోజు రాజగోపాల చారిని మంగళవారం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. గని ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఆయనకు శాలువా కప్పి, పూలమాలలతో సత్కరించి భవిష్యత్తు జీవితం ప్రశాంతంగా, ఆరోగ్యంగా సాగాలని ఆకాంక్షించారు. సంస్థ అభివృద్ధిలో ఆయన అందించిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ సెంట్రల్ కమిటీ మెంబర్ ఎండీ. లాలా, బ్రాంచ్ నాయకులు వెంగల కుమారస్వామి, పిట్ సెక్రటరీ జైపాల్ రెడ్డి, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, సోషల్ మీడియా ఇంచార్జ్ నవీన్ కుమార్, షిఫ్ట్ సెక్రటరీ జి. రాజు, షిఫ్ట్ ఇంచార్జ్లు శంకర్, అరుణ్, రాజ్ కుమార్, సంఘం కార్యకర్తలు సత్యనారాయణ, తలారి రవి, హరీష్, వహీద్, స్వామి, హనుమంతు తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్కు చెందిన లబ్ధిదారులు దుర్గం రాంబాయి – మల్లయ్య దంపతులు నిర్మించుకున్న నూతన గృహాన్ని మేయర్ ధర్ని మధుకర్ సోమవారం ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సహకారంతో పూర్తయిన ఈ ఇంటి గృహ ప్రవేశ మహోత్సవానికి మేయర్తో పాటు స్థానిక కార్పొరేటర్ తోట రజిత శ్రీనివాస్ హాజరై లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మేయర్, కార్పొరేటర్లను లబ్ధిదారులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు
- శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జీఎంకు ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం
నస్పూర్, ఆర్.కె న్యూస్: సింగరేణిలో ఉన్నత విలువలు, క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన అధికారిగా నల్లగుంట సత్యనారాయణ విశేష గుర్తింపు పొందారని ఐఎన్టీయూసీ సీనియర్ కేంద్ర ఉపాధ్యక్షులు జెట్టి శంకర్ రావు కొనియాడారు. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఓటు జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ పొందనున్న నల్లగుంట సత్యనారాయణకు బంగ్లాస్ ఏరియాలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం జరిగింది. ఐఎన్టీయూసీ నాయకులు ఆయనను ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. సత్యనారాయణ సింగరేణిలో ఆర్కే 6 గని మేనేజర్గా, ఆర్కే 7 గ్రూప్ ఏజెంట్గా, కైరిగూడ ఓపెన్కాస్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్గా కీలక బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థ అభివృద్ధికి విశేష సేవలందించారని ఈ సందర్భంగా శంకర్ రావు గుర్తుచేశారు. సత్యనారాయణ సుదీర్ఘకాలం సింగరేణిలో సేవలందిస్తూ ఉత్పత్తి లక్ష్యాలను, భద్రతను సమన్వయం చేస్తూ తోటి అధికారులకు ఆదర్శంగా నిలిచారని ఐఎన్టీయూసీ నాయకులు ప్రశంసించారు. గనుల్లో ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టి భద్రతా ప్రమాణాల అమలులో ప్రత్యేక శ్రద్ధ చూపించారని కొనియాడారు. పదవీ విరమణ అనంతరం కూడా తమ అపార అనుభవాన్ని సమాజ సేవకు వినియోగిస్తూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ కేంద్ర నాయకులు గరిగ స్వామి, పి. తిరుపతి రాజు పాల్గొన్నారు.
ప్రతిసారి రెండు చుక్కలతోనే పోలియోపై నిరంతర విజయం సాధ్యం: మేయర్ ధర్ని మధుకర్
ఐదేళ్ల లోపు పిల్లలందరికీ చుక్కలు వేయించాలని మున్సిపల్ మేయర్ పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ప్రతిసారి రెండు చుక్కలు వేయించడం ద్వారానే పోలియో మహమ్మారిపై నిరంతర విజయం సాధ్యమవుతుందని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కుటుంబ సంక్షేమ శాఖ, మిషన్ డైరెక్టర్ ఎన్హెచ్ఎం సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోలియో దినం కార్యక్రమాన్ని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఆదిత్య స్కూల్లో ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేళ్ల లోపు వయస్సు గల పిల్లలకు పోలియో చుక్కలు వేసిన మేయర్, చిన్న పిల్లలకు ఈ చుక్కలు వేయించాల్సిన అవశ్యకత గురించి తల్లిదండ్రులకు వివరించారు. పిల్లల భవిష్యత్తును సురక్షితంగా మార్చడానికి పోలియో చుక్కల కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని మేయర్ ధర్ని మధుకర్ వివరించారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అర్హులైన పిల్లలందరికీ వంద శాతం పోలియో చుక్కలు అందేలా వైద్య ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్తో పాటు స్థానిక ఏఎన్ఎం కవిత, 32వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గోపతి తిరుపతి, స్థానిక కాంగ్రెస్ నాయకులు, ఆశా కార్యకర్తలు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
- యంత్రాల పనిగంటలు పెంచి సంస్థ అభ్యున్నతికి పాటుపడాలి
- శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్
- శ్రీరాంపూర్ ఏరియా వర్క్షాప్లో 12 టన్నుల నూతన క్రేన్ ప్రారంభం
నస్పూర్, ఆర్.కె న్యూస్: శ్రీరాంపూర్ ఏరియా బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతలో ఏరియా వర్క్షాప్ పాత్ర కూడా ఎంతో కీలకమని శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం ఏరియా వర్క్షాప్లో నూతనంగా అందుబాటులోకి తెచ్చిన 12 టన్నుల క్రేన్ పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అన్ని భూగర్భ, ఉపరితల గనులకు అవసరమైన యంత్రాల నిర్వహణ, మరమ్మతులు సక్రమంగా జరగాలని సూచించారు. ఎలాంటి తాత్సారం లేకుండా సకాలంలో సంబంధిత గనులకు యంత్రాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రతి ఒక్కరు నిబద్ధతతో కృషి చేయాలని వర్క్షాప్ అధికారులు, ఉద్యోగులను కోరారు. నూతనంగా అందుబాటులోకి తెచ్చిన ఈ క్రేన్తో పాటు ఇతర భారీ వాహనాలు, యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని మునిగంటి శ్రీనివాస్ సూచించారు. యంత్రాల పనిగంటలను పెంచి సంస్థ అభ్యున్నతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్తో పాటు ఎస్ఓటు జీఎం ఎన్. సత్యనారాయణ, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ బాజీ సైదా, డీజీఎం (వర్క్షాప్) కృష్ణారెడ్డి, డీవై సీఎంఓ రమేష్ బాబు, పిట్ సెక్రటరీ సదానందం, సంక్షేమ అధికారి రమేష్ నాయక్, ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
- మంచిర్యాల 32వ డివిజన్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ప్రారంభం
- స్థానిక బీఎల్ఓలకు దరఖాస్తులు అందజేయాలని పిలుపు
నస్పూర్, ఆర్.కె న్యూస్: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుకు సంబంధించిన పత్రాలను నింపి స్థానిక బీఎల్ఓలకు అందజేయాలని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ ఏఎస్ఆర్ఆర్ నగర్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓటర్లకు సవరణ కార్యక్రమానికి సంబంధించిన పత్రాలను అందజేసి అవగాహన కల్పించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవడంతో పాటు జాబితాలో తప్పులను సరిదిద్దుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని మేయర్ ధర్ని మధుకర్ వివరించారు. జాబితాలో పేర్ల మార్పులు, చేర్పులు, చిరునామా సవరణల కోసం పౌరులు తమ పరిధిలోని బూత్ స్థాయి అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ ప్రక్రియపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్తో పాటు కార్పొరేటర్లు సంపత్ రెడ్డి, కర్ర శ్రీను, బూత్ స్థాయి అధికారులు, బూత్ స్థాయి ఏజెంట్లు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.
అడిషనల్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పణ
నస్పూర్, ఆర్.కె న్యూస్: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపులో భాగంగా గురువారం తెలంగాణ రాష్ట్ర యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ మంచిర్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ, విద్యారంగ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి టీఎస్యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని, 2023 జూలై 1 నుండి అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయులకు శాపంగా మారిన సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. అలాగే నూతన విద్యా విధానంను రద్దు చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపివేసి అవసరమైన చోట కొత్త పాఠశాలలను తెరవాలన్నారు. విద్యాహక్కు చట్టానికి సవరణలు చేసి, సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ నుండి మినహాయింపు ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ పి. చంద్రయ్యకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎస్యూటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు వి. కిరణ్ కుమార్, జిల్లా కోశాధికారి బి. కిరణ్, జిల్లా కార్యదర్శి బి. దేవదాస్, జిల్లా కమిటీ సభ్యులు యు. తిరుపతి, భారీక్ రావు, తిరుపతి, శ్రీనివాసరెడ్డి, రాములు, శంకర్ తదితరులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమం ద్వారా నియోజకవర్గంలో ప్రతి పేదవాడికి ఇల్లు అందే వరకు స్థానిక శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో కృషి చేస్తామని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ పేర్కొన్నారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9వ డివిజన్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు కిస్టాపురం మంగ-మల్లేష్ నూతన గృహప్రవేశ కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన రిబ్బన్ కట్ చేసి నూతన గృహాన్ని ప్రారంభించారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయని ఈ సందర్భంగా మేయర్ వెల్లడించారు. పేదలకు సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని మేయర్ ధర్ని మధుకర్ వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు దక్కేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. గృహప్రవేశం చేసిన లబ్ధిదారుల కుటుంబ సభ్యులు నూతన ఇల్లు సమకూరడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్తో పాటు స్థానిక కార్పొరేటర్ సురిమిల్ల సౌమ్య వేణు, కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధికారి, హౌసింగ్ బోర్డు అధికారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
నస్పూర్, ఆర్.కె న్యూస్: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సింగరేణి అధికారుల నిరసన కార్యక్రమాలు ఉధృతమవుతున్నాయి. ఈ నెల 19న శ్రీరాంపూర్ ఏరియాతో పాటు సింగరేణిలోని అన్ని రీజియన్లలో భారీ ర్యాలీలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో బుధవారం అధికారులు మరోసారి ఆందోళనకు దిగారు. ఉదయం నుండి అధికారులు అందరూ నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం సాయంత్రం వేళ జీఎం కార్యాలయ ప్రాంగణంలో చేరి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ఏరియా అధ్యక్షులు లక్కాకుల మహేష్ నాయకత్వంలో అధికారులు జీఎం కార్యాలయ వేదిక వద్ద తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. అధికారులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని వీడాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా స్పందించకపోతే వచ్చే సోమవారం నుండి నిరాహార దీక్షలు చేపట్టడానికి సైతం వెనుకాడబోమని వారు స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సీఎంఓఏఐ శ్రీరాంపూర్ ఏరియా జనరల్ సెక్రటరీ మల్లయ్య, జాయింట్ సెక్రటరీ భీమన్న, ట్రెజరర్ పద్మలతో పాటు శ్రీరాంపూర్ ఏరియాలోని అన్ని గనులు, విభాగాలకు చెందిన అధికారులు, మహిళా అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



